Monday, February 18, 2013

పుస్తక పరిచయం - భోజన భోగం

భోజన భోగం ...జి వి పూర్ణచంద్

ఆరోగ్యవంతమైన బోజనమే నిజమైన భోగం




            అన్నం పరబ్రహ్మ స్వరూపం. అది ప్రాణాన్ని నిలుపుతోంది. ప్రాణానికొక జీవనీయతని కల్పిస్తోంది. సాక్షాతూ అన్నమే ఔషధంగా  జీవుల్ని నడుపుతోంది.

           ఆదునిక సమాజంలో అన్నం విషయంలో ఈ దృక్పధంలో కొంత మార్పు ఏర్పడింది. " ఆహారం వేరు - ఔషదాలు వేరు " అనే దృష్టి పెరిగింది. " మీ ఇష్టం వచ్చింది తినండి - ఈ బిళ్ళ వేసుకోండి " అంటేనే రోగికి డాక్టర్ నచ్చుతున్నాడు.

          సారవంతమైన కురగాయల్ని నిస్సారంగా వండుకుని తింటూ - కాళ్ళు నొప్పులూ, కడుపులో మంటలు అని నిత్యరొగ పీడితుల్లా మనం ఎందుకు మారిపోవాలి ?

         పొన్నగంటి కూర కావాలంటే మనకి ఏ కూరగాయల మార్కెట్లోనూ దొరకదు. గంగ పోవిలికూర, చక్రవర్తి కూర , చిర్రికూర, - వెతి సంగతి సరే సరి .  పొలాల గట్ల మీద పెరిగే ఈ ఔషధాలని పిచ్చి మొక్కలుగా రైతులు కూడా చాల మంది బావించడం అచ్చర్యకరమైన మార్పే. మన పెరటిలోనే ఆ పుటకు వంటకు కావలసిన మొక్కలు చాల ఉంటాయి. కానీ, తినేవి కావేమోనని వాటి జోలికి మనం వెళ్ళడం లేదు.

     ఆయుర్వేద శాస్త్రం లో ఆరోగ్యాన్ని పరి రక్షించేందుకు ఎన్నో ఆహార పదార్ధాలు - వాటిని వండుకునే విధానం, వాటి గునదోశాలు వివరాలు నిక్షప్తంగా ఉన్నాయి. అన్ని ఈ కాలంలో ప్రజలకు అవసరమే. వాటిని సామాన్య మానవుడికి అన్డుబతులుకి తెచ్చే ప్రయత్నమే ఈ " భోజన భోగం "


రచయత గురించి :
డా. జి. వి. పూర్ణచ౦దు సాహిత్యాభిలాషి. వ౦దకు పైగా పుస్తకాల రచన. వాటిలో నలభై వరకూ సామాన్యుడికోస౦ వైద్య రహస్యాలను తెలిపిన పుస్తకాలున్నాయి. “తరతరాల తెలుగు రుచులు” పరిశోధనా గ్ర౦థ౦ తెలుగు వారి ఆహార చరిత్రపైన వెలువడిన తొలిగ్ర౦థ౦గా ప్రసిధ్ధి పొ౦ది౦ది. ఆ౦ధ్రభూమి ఆదివార౦ భూమిక, నడుస్తున్న చరిత్ర, నది, చినుకు మాసపత్రికలు ఇ౦కా అనేక మాస, వార పత్రికలలో శీర్షికలు వస్తున్నాయి.  ద్రావిడ విశ్వవిద్యాలయ౦ ప్రచురి౦చిన  "నైలూ ను౦చి కృష్ణ దాకా", ఆ౦. ప్ర. అధికార భాషా స౦ఘ౦ ప్రచురి౦చిన "తెలుగే ప్రాచీన౦" గ్ర౦థాలు పరిశోధకుడిగా వీరికి మ౦చి పేరు తెచ్చిపెట్టాయి. తెలుగు భాష ప్రాచీనతనిరూపి౦చే వ్యాసాలు అనేక౦ ప్రచురితమయ్యాయి. తెలుగు భాషకు ప్రాచీనతా హోదాను సాధి౦చట౦లో చురుకైన పాత్ర పోషి౦చారు. కృష్ణాజిల్లా రచయితల స౦ఘ౦ ప్రథాన కార్యదర్శి. ప్రప౦చ తెలుగు రచయితల మహాసభలు రె౦డుసార్లు విజయవాడలో నిర్వహి౦చి భాషోద్యమానికి ఊపిరి పోశారు. తెలుగు విశ్వవిద్యాలయ౦, 30కి పైగా ఇతర స౦స్థలు పురస్కారాలతో గౌరవి౦చాయి. 2012లో తిరుపతిలో జరిగిన నాలుగవ ప్రప౦చ తెలుగు మహా సభల స౦దర్భ౦గా తెలుగు విశ్వవిద్యాలయ౦ వారు వీరి ‘మన ఆహార౦’ ఆహార చరిత్ర పరిశోధనా గ్ర౦థాన్ని ప్రచురి౦చి సత్కరి౦చారు.



ఈ రచయత పుస్తకాల కోసం  ఇక్కడ నొక్కండి 

పేజిలు : 188

ధర : రూ 80/-


లబించు చోటు 

తెలుగు పుస్తకాల కోసం 

మీరు  నచ్చిన, మెచ్చిన  పుస్తకాల మీద మీ అభిప్రాయాలను, రివ్యూ లను 
ఈ మెయిల్ కు పంపండి : review@logili.com

మీపేరు తో వెబ్ సైట్ నందు ప్రచురింప బడతాయి.


please add for new book updates

No comments:

Post a Comment